నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్లో భాగంగా ఇవాళ ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. అనంతరం రక్షణ, హోం, రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను కలవనున్నారు. ఇక రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవనున్నట్లు సమాచారం.