ఈ నెల 27న నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు, నిరుద్యోగ సంఘాలు, పలువురు ఎమ్మెల్సీలు కోరిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది.