కవ్వింపు చర్యలకు పాల్పడిన వైసీపీ శ్రేణులు

5104చూసినవారు
ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ బుధవారం నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. జాతీయ రహదారి వెంబడి టీడీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలను చూపిస్తూ కేకలు వేస్తూ, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ శ్రేణులు వారిని పట్టించుకోకుండా సభకు కదలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్