దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో దారుణం జరిగింది. డబ్బు వివాదంలో ఐస్క్రీం వ్యాపారిని బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. దీంతో ఇండియా గేట్ వద్ద భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడిని ప్రభాత్గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.