YCPలో రోజాతో సమాన హోదా దక్కించుకున్న యాంకర్!

69చూసినవారు
YCPలో రోజాతో సమాన హోదా దక్కించుకున్న యాంకర్!
టాలీవుడ్ యాంకర్ శ్యామల.. ఇండస్ట్రీలో రాణించడమే కాకుండా ఏపీ రాజకీయాల్లో దూసుకెళుతున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ శ్యామలకు వైసీపీలో జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. శ్యామలను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటుగా వైసీపీలో యాక్టివ్‌గా ఉండే జూపూడి ప్రభాకర్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజాలను అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. వీరికి సమానంగా యాంకర్ శ్యామలకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్