వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియమించారు. తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతలను పెద్దిరెడ్డికి, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావు, ఆర్కే రోజా, యాంకర్ శ్యామలను నియమించారు.