కడప : ఆడపిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు

84చూసినవారు
ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. సోమవారం బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ. మాటల్లో చెప్పలేని అమానుషం ఇదేనన్నారు. 2021లో ఇలాంటి ఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే శిక్ష పడిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర నుంచి మేల్కోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్