మండల అభివృద్ధి కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తామని, అభివృద్ధికి అధికారులు సహకరించాలని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. శుక్రవారం ఓబులవారి పల్లి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు అన్ని వేళలా అధికారులు అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం వద్దని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు తాగు నీరు, రహదారుల వసతి కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.