ప్రమాదకరంగా స్తంభాలు

79చూసినవారు
తంబళ్లపల్లె పట్టణంలోని సాలె వీధి, నాగేంద్ర వీధిల్లో విద్యుత్ స్థంబాలు దెబ్బతిని ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని గ్రామస్థులు గురువారం తెలిపారు. అడుగు భాగం సిమెంటు పలకలు పూర్తిగా ఊడిపోయి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయన్నారు. ఆయా వీధుల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయన్నారి. గాలివానలకు స్తంభాలు కూలితే పెను నష్టం సంభవించే ప్రమాదముందన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్