జనసేనకు మరో కీలక పదవి దక్కనుంది. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ఎన్డీఏ సర్కారు నిర్ణయించింది. అయితే ఎవరికి ఇవ్వాలనే దానిపై
టీడీపీ,
జనసేన అధినేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ చీఫ్ విప్గా పొన్నూరు
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరును చంద్రబాబు ఖరారు చేశారని
టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.