సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు విధులు కేటాయించే అంశంపై ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది నియామకానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. వాలంటీర్లకు మాత్రం ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది. అలాగే పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లను అనుమతించొద్దని పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.