26 నుంచి ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్

54చూసినవారు
26 నుంచి ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్
ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లకు ఈ నెల 26 నుంచి 30 వరకు అవకాశం కల్పించారు. ధ్రువపత్రాల పరిశీలన జూన్ 27 నుంచి జులై 3 వరకు నిర్వహిస్తారు. జులై 1 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు ఉంటుంది. 8న సీట్లు కేటాయిస్తారు.

సంబంధిత పోస్ట్