వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త

64చూసినవారు
వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
2024 సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి గౌరవ వేతనం చెల్లించేందుకు ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నెల గరిష్ట వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్