ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసిన కొడుకు

51చూసినవారు
ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసిన కొడుకు
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కొత్త వడ్డెపల్లికి చెందిన ఉప్పొల్ల చిన్న సుబ్బయ్య (79), నాగమ్మ (75) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు మరణించాడు. దాంతో అతని పిల్లలకు ఆస్తిలో సగ భాగం ఇస్తానని తల్లిదండ్రులు చెప్పడంతో చిన్న కొడుకు రమణ్య పగబట్టాడు. భార్య కళావతితో కలిసి రమణయ్య తన తల్లిదండ్రులకు విషం ఇచ్చి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకు, కోడలిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్