ఈ నెల 25న APRJC, డీసీ సెట్-2024 పరీక్షలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. APRJCకి 32,666 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందన్నారు. అలాగే డీసీ సెట్కు 56,949 మంది అప్లై చేశారని.. వీరికి మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందన్నారు. గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.