చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్కుమార్ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో ఎన్నికల వేళ జరిగే ఘటనలకు ముందస్తుగా పసిగట్టి నిలువరించడం.. ఆ తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. యశ్వంత్ రాజ్కుమార్ మూడు నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.