సీఎం జగన్పై నిన్న జరిగిన రాళ్ల దాడి ఘటనపై పోలీసులు విచారణ వేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే దర్యాప్తు కోసం సీపీ కాంతి రాణా టాటా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏ సమయంలో, ఎక్కడ, ఎలా దాడి జరిగిందనే కోణంలో విచారణ కొనసాగుతోంది. జగన్పై దాడి కేసును డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాడికి పాల్పడిన వారి ఆచూకీ ఇంకా దొరకలేదు. సీసీ ఫుటేజీ సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు.