మారుతి సుజుకీ పలు మోడళ్లపై రాయితీని ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీలతోపాటు ఇతర మాడళ్లపై రూ.1.5 లక్షల వరకు రాయితీకి విక్రయిస్తుంది. వీటితోపాటు ఎక్సెల్ఆర్, ఇగ్నిస్, గ్రాండ్ విటారా మిల్డ్ హైబ్రిడ్, టర్బో-పెట్రోల్ రకం ఫ్రాంక్స్పై ఈ రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎక్స్ఎల్6, ఫ్లాగ్షిప్ ఇన్విక్టో ఎంపీవీ మోడళ్లకు ఈ రాయితీలు వర్తించవని పేర్కొంది.