గుంటూరు జిల్లా దుగ్గిరాల తమ్మపూడలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్త ఖాసీంపై వైసీపీ నేత కమల్ బ్యాట్తో దాడి చేశాడు. మంగళగిరి ఎన్నారై ఆస్పత్రికి ఖాసీంను తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. టీడీపీ గెలిచినందుకు సంబరాలకు సిద్ధమవుతుండగా ఖాసీంపై దాడి జరిగినట్లు సమాచారం. గంజాయి మత్తులో ఖాసీంపై రాత్రి క్రికెట్ బ్యాట్తో దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.