హేమాహేమీలు గెలిచిన చోట ముందంజలో బైరెడ్డి శబరి

81చూసినవారు
హేమాహేమీలు గెలిచిన చోట ముందంజలో బైరెడ్డి శబరి
నంద్యాల ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆధిక్యంలో ఉన్నరు. దాదాపుగా ఆమె గెలుపు ఖాయమైంది. ఆమె 42,459 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆమెకు 3,00,982 ఓట్లు పోలయ్యాయి. ఆమె విజయం సాధిస్తే నంద్యాలలో నెగ్గిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. కాగా ఇక్కడ గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రెండు సార్లు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఓసారి గెలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్