కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు ఆదివారం అద్దంకి మండలం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియచేశారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి మీరు కాదు అని ఆయన విమర్శించారు. మంచి ప్రభుత్వం పేరుతో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హేబేలు మండిపడ్డారు.