గిద్దలూరు పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి ప్రమాదాల బారిన పడితే కలుగు అనార్థాలను ప్రజలకు వివరించారు. జూలై నుంచి మారిన చట్టాల ప్రకారం 1, 000 జరిమానా తప్పదని హెచ్చరించారు.