గుంటూరు జీజీహెచ్ లో హిమోఫిలియా కేర్ సెంటర్ ప్రారంభం

50చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హిమోఫిలియా కేర్ సెంటర్ ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ పేదరోగులకు ప్రభుత్వ వైద్యశాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1, 100 మంది వ్యాధిగ్రస్తులకు సంపూర్ణ వైద్యాన్ని అందిస్తామని చెప్పారు. సెంటర్ ప్రారంభించిన నేపథ్యంలో ఓ పేషెంట్ కి వైద్యం అందించడానికి జీజీహెచ్ వైద్యులు సిద్దమయ్యారు.

సంబంధిత పోస్ట్