గుంటూరు ఛానల్‌ పనులపై కదలిక

55చూసినవారు
గుంటూరు ఛానల్‌ పనులపై కదలిక
ఇటీవల వర్షాలకు గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలు, గండిపడ్డ డ్రెయిన్లు, వాగులు, గుంటూరు ఛానల్‌ పరివాహక ప్రాంతాలపై కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ దృష్టి సారించారు. మరోసారి ఇలాంటి వరద నష్టం జరగకుండా అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రూ. 808 కోట్ల ప్రతిపాదనలతో కూడిన అంచనాలతో గుంటూరు ఛానల్‌ అభివృద్ధికి గాను చేపట్టాల్సిన పనులపై ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికారిని మంగళవారం పంపారు.

సంబంధిత పోస్ట్