గుంటూరులో వినూత్న నిరసన చేపట్టిన ఎన్ఎస్ యూఐ

58చూసినవారు
గుంటూరు హిమనీ సెంటర్ లో ఎన్ఎస్ యూఐ మంగళవారం వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కోల్ కత్తా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనను ఖండిస్తూ, నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్ యూఐ డిమాండ్ చేసింది. ప్రాణాలు కాపాడే వైద్యులకే సభ్య సమాజం తలదించుకునేలా రక్తం మరకలు అంటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.