గుంటూరు: ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం: మాధవి

50చూసినవారు
గుంటూరు: ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం: మాధవి
గుంటూరు విద్యానగర్ లోని శ్రీ సాయిబాబా ఆలయంలో నూతనంగా మహాద్వారం ఏర్పాటు చేశారు. ఈ మహా ద్వారంను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవీ గురువారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అదే విధంగా మహా ద్వారంపై నూతనంగా కలశ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరును ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్