ఆచార్య స్వరూప రాణిని సన్మానించిన ఏఎన్ యు సిబ్బంది

65చూసినవారు
ఆచార్య స్వరూప రాణిని సన్మానించిన ఏఎన్ యు సిబ్బంది
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ చల్లపల్లి స్వరూప రాణిని శుక్రవారం యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. గత గురువారం ఏపీ సీఎం చేతుల మీదగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు భాష పురస్కారం అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏఎన్ యు సిబ్బంది స్వరూప రాణిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్యూ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్