ఓటు హక్కు వినియోగించుకున్న పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అంబటి మురళీకృష్ణ సోమవారం పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అంబటి వెంట గ్రామ సర్పంచ్ జాలాది యానాది రావు ఉన్నారు.