ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి

70చూసినవారు
ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి
ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు ఈ కేవైసీ చేయించుకోవాలని తద్వారా ప్రభుత్వ పథకాలు అందుతాయని ఏడిఏ సి హెచ్ తిరుమల దేవి పేర్కొన్నారు. శుక్రవారం మండల వ్యవసాయాధికారిణి కిరణ్మయి తో కలిసి కాకుమాను మండలంలోని బికెపాలెం, గరికపాడు, చిన్న లింగాయపాలెం గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలను సందర్శించారు. నీట మునిగిన పంట పొలాల రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈనెల 25 లోపు ఈ కేవైసీ చేయించుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్