రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు సంబంధించి ప్రకాశం జిల్లాకు ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు శుక్రవారం నియమితులయ్యారు. ఏపీ స్వచ్ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న ఆయనను ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు.