ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

56చూసినవారు
రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్