ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తనను టార్చర్ చేస్తున్నారని పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మహాసేన రాజేష్ మాట్లాడుతూ.. ‘నన్ను పి.గన్నవరం నుంచి తప్పించినట్లు చంద్రబాబు చెప్పలేదు. కానీ నాకు చెప్పకుండా జనసేన నేతలు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారట. ఆ పార్టీ అభ్యర్థుల పేర్లతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ఇది నాకు అవమానకరం.’ అని పేర్కొన్నారు.