బీజేపీ రాజకీయ కురువృద్దుడు ఎల్ కే అద్వానీకి భారత రత్న ప్రకటించడంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టాలని ఎల్ కే అద్వానీ ప్రారంభించిన రథయాత్ర దేశంలో మత కల్లోలాలు సృష్టించిందని విమర్శించారు. ఈ యాత్రలో చాలా మంది చనిపోయారని గుర్తు చేశారు. మత కల్లోహాలకు కారణమై జైల్లో ఉండాల్సిన అద్వానీకి కేంద్రంలోని
బీజేపీ భారతరత్న ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు..