అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో దొరికిన 158 దుంగలు దొరికాయని, వాటి విలువ రూ.1.6కోట్లు ఉంటుందని అధికారులు పవన్ దృష్టికి తెచ్చారు. ఎర్రచందనం సూత్రధారులను పట్టుకోవాలని నిర్దేశించారు.