ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి ఒక్కరోజే ముగ్గురు కీలక నేతలు రాజీనామా చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, అనంతపురం జిల్లా శింగనమల మాజీ ఎమ్మెల్సీ యామిని బాల, వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిర్రాజు నగేష్లు రాజీనామాలు చేశారు.