కడపలో పేలుడు.. VRA మృతి

76చూసినవారు
కడపలో పేలుడు.. VRA మృతి
ఏపీలోని కడప జిల్లా వేముల మండలం వి.కొత్తపల్లిలో పేలుడు సంభవించింది. ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వీఆర్ఏ నరసింహులు మంచం కింద దుండగులు జిలేటిన్ స్టిక్స్ పెట్టారు. అవి పేలడంతో నరసింహులు మృతి చెందగా.. అతని భార్యకు గాయాలయ్యాయి. ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్