కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ టార్గెట్ బొత్స?

62చూసినవారు
కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ టార్గెట్ బొత్స?
ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ టీడీపీ కూటమి టార్గెట్ గా మారిపోయారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతూనే ఈ సీనియర్ నేత మీద ఫుల్ గా ఫోకస్ పెట్టాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. బొత్సను ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు గట్టిగా టార్గెట్ చేశారు. బొత్స వల్లనే ఉత్తరాంధ్రాలో అభివృద్ధి లేకుండా పోయిందని నిందించారు. ఆయనను ఏలాగైనా ఓడించాలని బాబు ఎంతో ఆలోచించారు. సీనియర్లను దింపితే తప్ప బొత్స ఓడరు అని భావించి కళా వెంకటరావుని రంగంలోకి దింపారు. అనుకున్నట్లుగా బొత్స ఓటమి జరిగిపోయింది.

సంబంధిత పోస్ట్