బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక పురోగతి

61చూసినవారు
బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక పురోగతి
పశ్చిమ బెంగాల్‌లో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఓ కాలువలో మానవ ఎముకలను గుర్తించారు. ఈ కేసులో కీలక అనుమానితుడిని నేపాల్‌లో అరెస్టు చేసిన పోలీసులు.. భారత్‌కు తీసుకువచ్చారు. అతడి సమాచారం మేరకు గాలింపు చేపట్టిగా.. బాధితుడిగా భావిస్తోన్న శరీర భాగాల ఎముకలు లభ్యమయ్యాయి. మరోవైపు, ఈ హత్య కోసం ఎంపీ సన్నిహితుడే నిందితులకు దాదాపు రూ.5 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్