కేంద్రంలో టీడీపీ మంత్రుల శాఖలు ఇవేనా?

65చూసినవారు
కేంద్రంలో టీడీపీ మంత్రుల శాఖలు ఇవేనా?
AP: కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్(గుంటూరు) స్థానం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో వీరికి కేటాయించే శాఖల‌పై ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ఈ ఇద్ద‌రిలో ఒకరికి ఐటీశాఖ, మరొకరికి ఉక్కు, గనులశాఖ కేటాయించ‌నున్నార‌ని ఆ వార్త సారాంశం. దీనిపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది. ఇదిలా ఉండ‌గా టీడీపీ ఆశించిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను జేడీయూకు కేటాయించనున్నట్లు స‌మాచారం.

సంబంధిత పోస్ట్