దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు రికార్డు నెలకొల్పనున్నారు. ఈ క్రమంలో "కేంద్ర మంత్రిగా బీసీ నేత, మన సిక్కోలు బిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడు." అని పేరొంటూ టీడీపీ ట్వీట్ చేసింది. 36 ఏళ్ళకే కేంద్ర మంత్రి పదవిని చేపట్టనున్నారని పేర్కొంది. బీటెక్, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన ఆయన తొలుత 2014 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు.