తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. భక్తులు ఇబ్బందులు

79చూసినవారు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే బ్రహ్మోత్సవాల వేళ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అరకొర సౌకర్యాలు కల్పించారని భక్తులు దేవస్థాన అధికారులపై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఎండలో భక్తులకు కనీసం తాగునీరు, మజ్జిగ సరఫరా చేయలేదని వాపోయారు. వరాహ స్వామి గుడికి ఎదురుగా ఉన్న మాడవీధుల గ్యాలరీలలో దుప్పట్లు వేసుకుని తీవ్రమైన ఎండలో భక్తులు ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్