సార్ కాపాడండి.. ఇరాక్‌లో తెలంగాణ యువకుడి నరకయాతన (వీడియో)

65చూసినవారు
మంచి జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్లను నమ్మి మోసపోయనని ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌కు చెందిన పల్లపు అజయ్‌ 14 నెలల క్రితం ఏజెంట్ మాటలు నమ్మి రూ.2.70 లక్షలు కట్టి ఇరాక్‌ దేశానికి వెళ్లాడు. అక్కడ ఏజెంట్ తనని మోసం చేసి, పాస్ పోర్ట్ తీసుకొని ఒక గదిలో బంధించి వెళ్లాడని తెలిపాడు. అక్కడి భాష రాక, బయటకు వెళ్లలేక రోజూ పస్తులతో ఇబ్బందులు పడుతున్నానంటూ.. తనని ఎలాగైనా స్వదేశానికి తీసుకొని వెళ్లాలని వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్