హర్యానాలో బోణీ కొట్టిన కాంగ్రెస్‌.. అఫ్తాబ్ అహ్మద్ ఘన విజయం

75చూసినవారు
హర్యానాలో బోణీ కొట్టిన కాంగ్రెస్‌.. అఫ్తాబ్ అహ్మద్ ఘన విజయం
హర్యానాలో కాంగ్రెస్‌ బోణీ కొట్టింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నూహ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అఫ్తాబ్ అహ్మద్ 46,963 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, గతంలో కూడా నూహ్‌ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. హర్యానాలో ప్రస్తుతం బీజేపీ 49, కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్