ఘోరం.. కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి

70చూసినవారు
ఘోరం.. కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి
కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడు కేక్ తిని మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. స్విగ్గీ డెలివరీ బాయ్ బాలరాజ్ ఆర్డర్ క్యాన్సిల్ అవడంతో సదరు కేక్ ను ఇంటికి తీసుకొచ్చారు. అయితే కేక్ ను ఎవరితోనూ పంచుకోకుండా ఇంట్లోని భార్య, కుమారుడితో తను కూడా తినగా.. కొద్ది సేపటికే వీరు అనారోగ్యం పాలయ్యారు. కొడుకు ధీరజ్ మరణించాడు. భార్యాభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్