బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మయ్యపాలెం దగ్గర ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొద్దికూరపాడు నుంచి కోటప్పకొండకు వెళ్తున్న బస్సు టైరు పంక్చర్ అయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.