ఏపీకి కేంద్రం మరో శుభవార్త

82చూసినవారు
ఏపీకి కేంద్రం మరో శుభవార్త
ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దాంతో ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణ, సౌకర్యాల కల్పనలో కృష్ణా జిల్లా కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చెప్పారు. కాగా, డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ఈ క్షిపణి పరీక్ష కేంద్రం అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్