ఫైబర్ నెట్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబును A-1గా, వేమూరి హరికృష్ణను A-2గా, కోగంటి సాంబశివరావు A-3గా చేరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ సమర్పించింది. కాగా, ఇటీవల అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(IRR) కేసులో చంద్రబాబును A-1గా, మాజీ మంత్రి నారాయణను A-2గా పేర్కొంటూ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.