ప్రజలను మోసం చేయడమే పనిగా సీఎం చంద్రబాబు పెట్టుకున్నారని, శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను దాచి అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్లు అప్పుచేశారని ఆరోపించిన టీడీపీ, గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లు అప్పులని వినిపించారని దుయ్యబట్టారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకు రూ. 5.18 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని పేర్కొన్నారు.