AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 25 వరకు చేపట్టాల్సిన ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను సీఈవో ముకేశ్ కుమార్ మీనా వాయిదా వేశారు. ప్రస్తుతం ఉన్న వెర్షన్తోనే విధులు నిర్వహించాలని అన్ని శాఖల HODలను ఆదేశించారు. కొత్త షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామన్నారు. అప్గ్రేడ్ వల్ల ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ ఇటీవల చంద్రబాబు ఈసీ, గవర్నర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే.