ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు మోదీతో చర్చించినట్లు సమాచారం. ఏపీ ఆర్థిక పరిస్థితులు, పోలవరం, రాజధాని అంశాలపై ప్రధాని మోదీకి చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, విభజన హామీలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయించాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది.